అహ్మదాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొలీజియం పద్ధతిపై దేశ ప్రజలు సంతృప్తిగా లేరని చెప్పారు.
రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం.. న్యాయమూర్తులను నియమించే బాధ్యత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో సోమవారం నిర్వహించిన సబర్మతి సంవాద్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల నియామకాలను ‘నిర్ణయించేందుకే’ జడ్జీల సమయం సగం అయిపోతున్నదని, వారి ప్రాథమిక కర్తవ్యమైన ‘న్యాయసేవలు అందించడం’పై ఇది ప్రభావం చూపుతున్నదని అన్నారు.