నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి25: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలుపార్టీల నుంచి పెద్దఎత్తున్న నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన పలు గ్రామాల నాయకులు టీఆర్ఎస్లో చేరారు. నిడమనూరు మండలం నారమ్మగూడెంకు చెందిన నీటిసంఘం మాజీ డైరెక్టర్ గడ్డం సత్యనారాయణరెడ్డి, ఎర్రబెల్లి వార్డు సభ్యుడు జానీ, నాగరాజు, కార్యకర్తలు మిర్యాలగూడ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, అరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. గుర్రంపోడు మండలం ఉట్లపల్లి, వెంకటాపురం(ఎస్), సుల్తాన్పురం, పాశంవారిగూడెం, శాఖాజిపురం, మొండికానిగూడెం, పాల్వా యి, మైలాపురం, కాచారంలో వివిధ పార్టీలకు చెందిన 180 మంది ఉప ఎన్నికల మండల ఇన్చార్జి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు సమక్షంలో మధిర, ఎర్రుపాలెం మండలాలకు చెందిన 150 కుటుంబాలవారు టీఆర్ఎస్లో చేరారు.