దళితబంధు పథకాన్ని నిలిపివేయించిన బీజేపీ, ఈటల రాజేందర్పై ఆగ్రహజ్వాలలు ఆగట్లేదు. తమ పొట్టగొట్టారని, తినే కంచాన్ని లాక్కున్న బీజేపీ మట్టికొట్టుకుపోతుందని దళితులు మండిపడుతున్నారు. బుధవారం జమ్మికుంట తెలంగాణ చౌక్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ‘మీరెన్ని జిమ్మిక్కులు జేసినా మీ బీజేపీకి ఓటెయ్యమని.. రెండు వందల శాతం టీఆర్ఎస్నే గెలిపిస్తమని స్పష్టంచేశారు. -జమ్మికుంట