రేగొండ, ఆగస్టు 27: రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని చెన్నాపురం, రూపిరెడ్డిపల్లి, కనిపర్తి, రేపాక, రేపాకపల్లి, లింగాల, పోచంపల్లి, రంగయ్యపల్లి గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుల కోసం ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల మరమ్మతులు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, వాహనాల పంపిణీ, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నారని వివరించారు.
ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడంలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపితే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.ఎంపీడీవో సురేందర్, సర్పంచ్లు దేవునూరి శ్రీనివాస్, బండారు కవితా దేవేందర్, సుధాకర్, పోనుగంటి తిరుపతి, రజిత, గంగుల రమణారెడ్డి, దగ్గు సంధ్య, ఎంపీటీసీలు కేసీరెడ్డి ప్రతాప్రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ విజయ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంకం రాజేందరు, మటిక సంతోశ్, ఎర్రబెల్లి రవీందర్రావు, పున్నం రవి, సాయియి ముత్యంరావు, సామల పాపిరెడ్డి ఉన్నారు.
మృతుల కుటుంబాలకు గండ్ర పరామర్శ
గణపురం: హైదరాబాద్ వనస్తలిపురం వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బుద్దారం గ్రామానికి చెందిన అడ్డూరి పవన్ కల్యాణ్రెడ్డి, బస్వరాజుపల్లికి చెందిన పైసా నవీన్ కుటుంబాలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం పరామర్శించారు. తన ప్రగాఢ సానూభూతి తెలిపారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలుసాని లక్ష్మినరసింహరావు, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచంద్రారెడ్డి, సర్పంచ్ చెరుకు కుమారస్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సంపత్రావు, రాజేశ్వర్రావు, సాంబయ్య పాల్గొన్నారు.