శ్రీగాధ వంతెన వద్దకు చేరుకున్న కాళేశ్వరం జలాలు
ర్యాలీగా తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు
గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు
గంభీరావుపేట, మార్చి 29: మండుటెండలో కూడవెల్లి వాగు ద్వారా ఎగువమానేరుకు గోదావరి జలాలు పరవళ్లు తొక్కడం మహాద్భుతమని టీఆర్ఎస్ నాయకులు అన్నా రు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం చెక్డ్యాం నుంచి గంభీరావుపేట మండలం శ్రీగాధ వంతెన వద్దకు చేరుకున్న కాళేశ్వరం జలాలను చూసేందుకు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావుతోపాటు గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ‘జై కేసీఆర్.. జై కేటీఆర్.. అంటూ నినదించారు. గోదావరి జలాలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, పూలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. ఎగువ మానేరుకు హారతినిచ్చారు. అనంతరం సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. జలస్వప్నం సాకారం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, ఇరిగేషన్ ఈఈ అమరేందర్రెడ్డి, ఎంపీపీలు వంగ కరుణ, జనగామ శరత్రావు, పిల్లి రేణుక, జడ్పీటీసీలు కొమిరిశెట్టి విజయ, గుండం నర్సయ్య, చీటి లక్ష్మణ్రావు, సర్పంచ్ కత్తుల బాబు, పీఏసీఎస్ చైర్మన్ భూపతి సురేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, సురేందర్రావు, కృష్ణహరి, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అహ్మద్, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, సెస్ మాజీ డైరెక్టర్లు కొక్కు దేవేందర్యాదవ్, విజయరామారావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజేందర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, కమ్మరి రాజారాం, గౌరినేని నారాయణరావు, సదాశివరెడ్డి, రాజనర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట, మార్చి 29: కూడవెళ్లి వాగు నుంచి శ్రీగా ధ వంతెన వద్దకు చేరుకున్న కాళేశ్వరం జలాలను చూసేందుకు మండల కేంద్రం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఇక్కడ ఆర్బీఎస్ మండల కన్వీనర్ రాధారపు శంకర్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మామిండ్ల తిరుపతిబాబు, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ కోల అంజవ్వ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్గౌడ్, నాయకులు గుళ్లపల్లి నర్సింహారెడ్డి, కోల నర్స య్య, పులి రమేశ్, ఇల్లెందుల శ్రీనివాస్రెడ్డి, సల్వాజి శ్రీనివాస్రావు, కుంబాల మల్లారెడ్డి, మేడిశెట్టి మల్లేశం, గొట్టె శ్రీకాంత్, మేడిశెట్టి శ్రీనివాస్, పిల్లి కిషన్, ఎండీ జబ్బార్, కంకణాల శ్రీనివాస్ ఉన్నారు.
ముస్తాబాద్, మార్చి 29: ఎగువమానేరుకు తరలివస్తున్న కాళేశ్వరం జలాలకు శ్రీగాధ వంతెన వద్ద మండల ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు కలకొండ కిషన్రావు, నేవూరి పొచిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.