ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు సమృద్ధిగా నీరు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో నిరంతరం సరఫరా చేస్తాం
మంత్రి కొప్పుల ఈశ్వర్
జడ్పీ చైర్మన్ మధూకర్తో కలిసి సీఎంకు విజ్ఞప్తి
పెద్దపల్లి, మార్చి 27 (నమస్తే తెలంగాణ)/ధర్మపురి: జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎస్సారెస్పీ కాలువల ద్వారా చివరి ఆయకట్టుకూ పుష్కలంగా నీరందుతుందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ‘నమస్తే’తో ఫోన్లో మాట్లాడారు. శనివారం పెద్దపల్లి జడ్పీచైర్మన్ మధూకర్తో కలిసి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసినట్లు చెప్పారు. ధర్మపురి, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో పంటలు పొట్టదశకు వచ్చాయని, ప్ర స్తుతం కాలువల ద్వారా నీరు అందుతున్నప్పటికీ సరిపడా రాక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పం దించారన్నారు. వారబందీ లేకుండా చివరి ఆయకట్టు వరకు నిరంతరం సా గునీరందించాలని సంబంధిత శాఖ అధికారులను వెంటనే ఆదేశించినట్లు చె ప్పారు. ఇక నుంచి గొల్లపెల్లి మండలంలోని డీ-60, డీ-64 కాలువలు, బు గ్గారం మండలంలోని డీ-53,డీ-54 కాలువలు, ధర్మారం, వెల్గటూర్ మం డలాల్లోని డీ-83 కాలువ, పెద్దపల్లి, మంథని, ఓదెల, శ్రీరాంపూర్ ప్రాంతాలకు డీ-86 కాలువ ద్వారా చివరి ఆయకట్టుకూ నిరంతరం సాగునీరందుతుందన్నారు. తెలంగాణ సర్కారు పూర్తి రైతు పక్షపాత ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసమే నిరంతరం పాటుపడుతున్నారన్నారు. రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఈసందర్భంగా పేర్కొన్నారు.