ధర్మారం, ఏప్రిల్1: ధర్మారం మండలం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికవడంపై మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు సంబురాలు చేసుకున్నారు. అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఎంపీడీవో జయశీలకు అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. కార్యాలయం ఎదుట కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో మా ట్లాడుతూ, కేంద్రస్థాయి అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని, మంత్రి కొప్పుల ఈశ్వర్ సంపూర్ణ సహకారంతో వచ్చిందని వివరించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
అవార్డు వచ్చిన సందర్భంగా మంత్రి ఈశ్వర్తోపాటు పీఆర్ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్, కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో, డీఆర్డీవో, డీపీవో, డీఎల్పీవోకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో మండలాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, సర్పంచ్ పూస్కూరు జితేందర్రావు, ఉప సర్పంచ్ ఆవుల లత, మండల పరిషత్ సూపరింటెండెంట్ ప్రేమ్ సాగర్, మార్కెట్ కార్యదర్శి సరోజ, పీఆర్, మిషన్ భగీరథ ఏఈలు మల్లేశం,విలాస్రావు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ జమున తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
విటమిన్ డి మనకు ఎందుకు అవసరమంటే..?