అభినవ్ సర్ధార్, రామ్కార్తిక్ హీరోలుగా నటించిన ‘పీనట్ డైమండ్’ చిత్ర టైటిల్ను ‘రామ్అసుర్’గా మార్చారు. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహిస్తూ అభినవ్ సర్ధార్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర ఫస్ట్లుక్ను సోమవారం హైదరాబాద్లో ఐటీ అడిషనల్ కమీషనర్ జీవన్లాల్, నిర్మాత రాజ్కందుకూరి విడుదలచేశారు. అభినవ్ సర్దార్ మాట్లాడుతూ ‘మాస్ ప్రేక్షకులకు చేరువ కావాలనే ఆలోచనతోనే టైటిల్ను మార్చాం. రెండు కాలాల వ్యవధుల్లో సాగే కథ ఇది. రామ్, సూరి అనే వ్యక్తుల జీవితాల్లో ఏం జరిగిందనేది ఆకట్టుకుంటుంది.
నవంబర్ 19న సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు.