ఆదిలాబాద్ : ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని అటెండర్ కాలనీలో శ్రీ రామంజనేయ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన పూజ కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు.
ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ..ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని అన్నారు. ఆలయాల అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. భక్తి భావంతో సన్మార్గంలో నడవాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యేకి కమిటీ సభ్యలు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో గోపాల కృష్ణ మఠాధిపతి యోగనంద సరస్వతి, సంతోష్ శర్మ, వైభవ్ శర్మ బృందం, నవతే శ్రీనివాస్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
నమీబియాలో ఊచకోతకు పాల్పడ్డాం : జర్మనీ