న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ‘స్నేహితులు ఉంటారు. కుటుంబం ఉంటుంది. కానీ కొందరు స్నేహితులు కుటుంబం అవుతారు.’ ఆత్మీయమైన స్నేహితులను కలిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. పాత స్నేహితులు, చిన్ననాటి స్నేహితులను కలసి కాసేపు సరదాగా గడిపితే మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు కనీసం చిన్న ఫోన్ కాల్ లేదా మెసేజ్ చేసినా కానీ మానసిక ఆరోగ్యం పెరుగుతుందని చెబుతున్నారు. కరోనా సమయంలో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా పెద్ద వయ స్సువారు చాలా ఇబ్బందులు పడ్డారు.