శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇటీవల అమాయక ప్రజలపై జరిగిన దాడులకు నైతిక బాధ్యత వహించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని పీడీపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మద్దతుతో ఏర్పడిన స్థానిక ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టీఆర్ఎఫ్) శ్రీనగర్లో తాజాగా పలు ఉగ్ర దాడులకు పాల్పడింది. కశ్మీరీ పండిట్ ఫార్మసిస్ట్, స్కూల్ ప్రిన్సిపాల్, ఒక టీచర్తోపాటు మరో ఇద్దరిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఉగ్ర దాడులకు వ్యతిరేకంగా పీడీపీ కార్యకర్తలు శుక్రవారం శ్రీనగర్లో నిరసన తెలిపారు. రక్తపాతాన్ని నివారించాలని నినాదాలు చేశారు.
పీడీపీ అధికార ప్రతినిధి సుహైల్ బుఖారీ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కశ్మీర్లో సాధారణ ప్రజలకు భద్రత కల్పించడంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.