పవన్ కల్యాణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజ్ఞాతవాసి తర్వాత విరామం తీసుకున్న పవన్ కల్యాణ్ ఈ ఏడాది నుంచి వరుసపెట్టి సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఇప్పటికే వకీల్సాబ్ షూటింగ్ పూర్తయింది. పవన్ తాజాగా క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు, సాగర్ చంద్రతో చేస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ షూట్లో పాల్గొంటున్నాడు. అయితే పవన్ లేటెస్ట్ అప్డేట్ ఒకటి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
పవర్ స్టార్ ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్ కు హాజరవుతున్నాడట. ఇవాళ ఉదయం క్రిష్ సినిమా షూటింగ్లో పాల్గొన్న పవన్..ఆ వెంటనే మళ్లీ హైదరాబాద్ శేరిలింగం పల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్లి రీమేక్ షూటింగ్ లో కూడా పాల్గొన్నట్టు టాక్. అంతేకాదు మరోవైపు జనసేన పార్టీ నేతలతో కూడా ఇంటరాక్ట్ అవుతున్నాడు పవన్. మొత్తానికి పవన్ సమయాన్ని వృధా చేయకుండా తన అభిమానుల కోసం సినిమాలు కంప్లీట్ చేస్తూ..మరోవైపు ప్రజల కోసం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతూ తీరిక లేకుండా ఉన్నాడు.