Pawan kalyan | ఫలితం ఎలా ఉన్నా చిరు మాత్రం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత చిరు మరింత జోష్తో సినిమాలను చేస్తున్నాడు. అయితే ‘ఖైదీ నెంబర్ 150’తో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. అదే సక్సెస్ను తన తదుపరి సినిమాలతో కంటిన్యూ చేయలేకపోతున్నాడు. ఇటీవలే విడుదలైన ‘ఆచార్య’ కూడా మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘గాడ్ఫాదర్’ సినిమాపైనే ఉన్నాయి. మోహన్రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’కు రీమేక్గా తెరకెక్కింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
‘గాడ్ఫాదర్’ చిత్రబృందం త్వరలోనే ప్రమోషన్స్ను మొదలు పెట్టనున్నారు. కాగా ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వేడుకకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ రాబోతున్నాడట. అయితే టాలీవుడ్ నుండి ఈ సినిమా ఈవెంట్కు పవర్ స్టార్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతుందో తెలియదు కాని, ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇప్పటికే ‘గాడ్ఫాదర్’ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్కు విశేష స్పందన రాగా.. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని రామ్చరణ్, ఆర్.బి.చౌదరి, ప్రసాద్ ఎన్వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సల్మాన్ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్లు కీలకపాత్రలు పోషించారు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు పోటీగా అదే రోజున నాగార్జున ‘ది ఘోస్ట్’, బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ విడుదల కానున్నాయి.