Pawan Kalyan | రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై, నేతల ఇండ్లపై దాడులు అరాచకానికి దారి తీస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసులపై, నేతల ఇండ్లపై దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. పార్టీ ఆఫీసులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులు, పరిణామాలపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.
రాష్ట్ర చరిత్రలో ఇటువంటి దాడులు ఏనాడూ జరుగలేదన్నారు. ప్రజాస్వామ్యంతో ప్రతి ఒక్కరికి నియంత్రణ అవసరం అని వ్యాఖ్యానించారు. వ్యక్తులు, పార్టీ ఆఫీసులపై దాడులు అరాచకానికి దారి తీస్తాయని, భవిష్యత్లో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. నిందితులను శిక్షించకపోతే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి చిరునామాగా మారుతుందని వ్యాఖ్యానించారు.