హైదరాబాద్: కళాతపస్వి కే.విశ్వనాథ్ శివైక్యం చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ దవాఖానలో కన్నుమూశారు. అటునుంచి ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్లోని స్వగృహానికి తరలించారు. ఆయన పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రముఖ నటులు విక్టరీ వెంకటేశ్, పవన్ కల్యాణ్, తనికెళ్ల భరణి, నాజర్, సాయికుమార్, బ్రహ్మాజీ, కోటా శ్రీనివాస రావు, మురళీ మోహన్, చిరంజీవి, బ్రహ్మానందం, రాధిక, ఉత్తేజ్, రాజా రవీంద్ర, దర్శకులు కే.రాఘవేంద్రరావు, త్రివిక్రం శ్రీనివాస్, గుణశేఖర్, రాజమౌళి, సత్యానంద్, సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, నిర్మాతలు అశ్వనీదత్, సీ.కల్యాణ్, అల్లు అరవింద్, సినీ గేయరచయిత చంద్రబోస్ తదితరులు కళాతపస్వి పార్థివదేహానికి నివాళులర్పించారు.