తిరుపతి, ఆగస్టు: పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణస్వామివారి ఆలయంలో రేపు పవిత్రోత్సవం జరుగనున్నది. అందుకోసం ఈరోజు ఉదయం ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, వాస్తు హోమం, అగ్నిప్రతిష్ట, కుంభస్థాపన, పవిత్ర ప్రతిష్ట, ఉక్తహోమం నిర్వహిస్తారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పవిత్రోత్సవం నిర్వహిస్తారు. రేపు ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ చేపడతారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం రాత్రి 8 గంటలకు పూర్ణాహుతి నిర్వహిస్తారు.