తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన చేపట్టారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ నిర్వహించారు.
అమ్మవారికి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, పరివార దేవతలకు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు. కాగా, సాయంత్ర 6.00 నుంచి 7.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో జేఈఓ సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి కస్తూరి బాయి, ఏఈఓ ప్రభాకర్రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.