మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని 17 వ వార్డులో రూ. 5లక్షలతో వీరభద్ర బార్ నుంచి గోపాల్ గిలాడ ఇండస్ట్రీస్ వరకు రోడ్ ఫార్మేషన్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మెన్ ఫరీద్, కౌన్సిలర్ యాళ్ల పుష్పలత, ఎడ్ల వేణు, గద్దె రవి, గోగుల రాజు,గుండా రాజశేఖర్ దితరులు పాల్గొన్నారు.