ముంబైలో అత్యధికులు లోకల్ రైళ్లపైనే ఆధారపడుతుంటారు. కొన్ని లక్షల మంది రోజూ వీటి ద్వారానే ప్రయాణం సాగిస్తుంటారు. అందుకే ముంబై నగరంలో లోకల్ రైళ్లకు విపరీతమైన డిమాండ్ వుంటుంది. రైల్వే కూడా అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తుంటుంది. ఈసారి మరో కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రయాణికులు తమ ప్రయాణంలో ఎలాంటి బోర్ ఫీల్ కాకుండా వుండేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు కొత్త ప్రటకన చేసింది. ముంబై లోకల్ రైళ్లలో ఇప్పటి నుంచి టీవీలను అమర్చనున్నారు. ఈ టీవీల్లో సినిమాలు, రక రకాల టీవీ షోలను ప్రసారం చేస్తామని రైల్వే పేర్కొంది.
ocal ఇదే విషయంలో ముంబై రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ లాహోటీ మాట్లాడుతూ… లోకల్ రైళ్లపై చాలా మంది ఆధారపడుతుంటారు. కరోనా కంటే ముందు ఈ రైళ్లలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణించేవారు. ఈ ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమ తమ సెల్ ఫోన్లు… ఇతరత్రా పరికరాలను తెచ్చుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు. దీనికి మేము మా వంతుగా సాంకేతికతను జోడించాలని నిర్ణయించాం. దీని ద్వారా ప్రయాణికులకు మరింత ఉల్లాసాన్ని పంచిన వారమవుతామని మా అభిప్రాయం అని అనిల్ కుమార్ లాహోటీ పేర్కొన్నారు.