తిరుమల,జూలై: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవం మరుసటి రోజైన జులై 16వ తేదీన పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలో ఉదయం10నుంచి11 గంటల వరకు ఏకాంతగా ఆణివార ఆస్థానం, పార్వేట ఉత్సవం ఆస్థానం నిర్వహిస్తారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం,వాహన సేవలు,ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు