మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, ఏప్రిల్ 3: టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య, సర్పంచులు మెగావత్ రాజునాయక్, నారాయణరెడ్డి, థామస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నర్సింహాగౌడ్ మాజీ అధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, డైరెక్టర్ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ మల్లేశ్ యాదవ్, ఉపసర్పంచ్ బురమోని నర్సింహా యాదవ్, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కంది రమేశ్, సుధాకర్రెడ్డి, మంత్రి రాజేశ్, నవీన్, ఆంధ్యానాయక్, రవీందర్, పర్వతాలు, బాల్రాజ్, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దు..
కందుకూరు : బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని బేగరకంచె, సార్లరావులపల్లి గ్రామాలకు చెందిన 100 మందికి పైగా మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. బేగరకంచె గ్రామానికి చెందిన పలువురు రైతులు మంత్రిని కలిశారు. పట్టా భూముల్లో మాకు ఇండ్లు ఉన్నాయి.. వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాం.. ఆ భూములను తీసుకోవద్దని విన్నవించారు. అధికారులతో చర్చించి న్యాయం చేస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు జరుపుల రూస్తా నాయక్ ఆధ్వర్యంలో వీరాలాల్, లక్ష్మణ్, తావు, లక్ష్మణ్, అంజమ్మ, రవితో పాటు అనేక మంది టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ , సురేందర్రెడ్డి, సాయిలు, ఎంపీటీసీ కాకి రాములు, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, డైరెక్టరు పొట్టి ఆనంద్, కాకి నర్సింహ ముదిరాజ్, ప్రవీణ్ నాయక్, శేఖర్ గుప్త, తదితరులు పాల్గొన్నారు.