చెన్నై : ఈ నెల 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ గ్రహణం పశ్చిమ రష్యా, కజకిస్థాన్లోని పలు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కనిపించనున్నదని తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ తెలిపింది. అయితే, భారత్లో చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పాక్షిక గ్రహణాన్ని వీక్షించవచ్చని పేర్కొంది. సూర్యగ్రహణం సాయంత్రం 5.14 గంటలకు ప్రారంభమై.. 5.44 గంటలకు ముగియనున్నది.
రష్యా, కజకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో 80శాతం ద్యశ్యమానత ఉంటుందని, ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణం కనిపిస్తుందని తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ పేర్కొంది. కంకణాకార గ్రహణాల సమయంలో సూర్యుడిని నేరుగా చూడడం సురక్షితం కాదని, గాగుల్స్ తదితర పరికరాలను వినియోగించి చూడాలని సూచించింది.
ఇదిలా ఉండగా.. సాక్షిక సూర్యగ్రహణం ఈ ఏడాది జూన్ 21న ఏర్పడిన విషయం తెలిసిందే. అలాగే నవంబర్ 8న చంద్రగ్రహణం ఏర్పడనున్నది. సాయంత్రం 5.38 గంటలకు ప్రారంభంకానున్నది. చంద్రోదయ సమయంలోనే గ్రహణం ఏర్పడుతుండడంతో గ్రహణం కనిపించే అవకాశాలు లేవని సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ వివరించింది.