న్యూఢిల్లీ: కరోనా సాకు చూపి రైళ్లలో వృద్ధులకు రాయితీ ఎత్తివేసిన నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ కీలక సూచన చేసింది. ఈ రాయితీలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంపై సమీక్ష జరపాలని, కనీసం స్లీపర్, ఏసీ 3-టైర్ తరగతుల్లోనైనా వృద్ధులకు ‘వెంటనే’ రాయితీలను పునరుద్ధరించాలని సిఫారసు చేసింది. ఈ మేరకు రైల్వే శాఖకు నివేదిక సమర్పించింది. రైలు చార్జీల్లో సీనియర్ సిటిజన్లకు గతంలో 40 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇచ్చిన విషయాన్ని ఆ నివేదికలో ప్రస్తావించింది.