న్యూఢిల్లీ : ఈ నెల 14వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఉభయ సభలు రెండు విడుతల్లో మొదట షిఫ్టులో రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిఫ్టులో సాయంత్రం 4 గంటల నంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ సమావేశమైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఒకే సమయంలో ఉభయ సభలు భేటీకానున్నాయి. తొలి విడుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ ఏడాది జనవరి 31న ప్రారంభమై.. ఫిబ్రవరి 11వ తేదీ వరకు కొనసాగాయి. పార్లమెంట్ సమావేశాల తొలి రోజున రాష్ట్రపతి ప్రసంగం చేయగా.. ఆ తర్వాత ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు సమర్పించారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టారు.