ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి
పాన్గల్: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతును రాజును చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జడ్పీచైర్మన్ రాకాసి లోక్నాథ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో ప్రాథమిక వ్యవసాయ సహాకార పరపతి సంఘం మహాజన సభను మంగళవారం విండో చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి అధ్యక్ష తన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, జడ్పీ చైర్మెన్ లోక్నాథ్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులకు సింగిల్ విండో ద్వారా రూ.11కోట్ల రుణాలను ఇవ్వడం శుభ పరిణామమన్నారు. పంట పెట్టుబడి దగ్గరి నుంచి కొనుగోలు వరకు ప్రభుత్వం అండగా ఉంటూ వారిని ప్రొత్సహిస్తున్నద న్నారు. అంతేకాకుండా కనీస మద్దతు ధర చెల్లించి మధ్య దళారుల బారిన పడకుండా చేస్తోందని తెలిపారు.
వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అనే రోజులు వచ్చాయని, రానున్న రోజుల్లో రైతులకు ఎంతో మేలు జరుగు తుందని తెలిపారు. సాంప్రదాయ పంటల సాగు కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి మరల్చాలని పిలుపు నిచ్చారు. రసాయనిక ఎరువులు వాడడం వల్ల పొలాలు పాడైపోతున్నాయని, సేంద్రీయ ఎరువులు ఉపయోగించుకుం టే, మన నేలల్లో బంగారాన్ని కూడా పండించవచ్చని సూచించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు.
అదేవిధంగా పాలెం వ్యవసాయ సైంటిస్టులు డాక్టర్లు విజయ, సుజాత, మహేశ్వరమ్మ, ప్రత్యూషలు వ్యవసాయ పంటల సాగు, తెగుళ్ల నివారణ, ఆయిల్ సీడ్స్ పంటల సాగుపై రైతులకు అవగాహాన కల్పించారు. అనంతరం సింగిల్ విండో చేపట్టిన రూ.2.50కోట్ల వ్యవసాయ రుణాలకు సంబంధించిన రైతు రుణమేళా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.
సమావేశంలో జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఎండీ.మునిరోద్దిన్, ఎంపీపీ శ్రీధర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ వెంక టయ్యనాయుడు, విండో వైస్ చైర్మన్ బాలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అనిల్కుమార్, తాసీల్దార్ చక్రపాణి, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు, ఎంపీటీసీలు కర్ణాకర్రెడ్డి, మిద్దె కృష్ణ, డైరెక్టర్లు జైపాల్రెడ్డి, ప్రసాద్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు నాయకులు చంద్రశేఖర్నాయక్, వీరసాగర్, జ్యోతినందన్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.