చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీల మధ్య పొత్తుల కోసం జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా మొదలుపెట్టాయి. తాజాగా అధికార అన్నాడీఎంకే ఆరుగురు అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. అందులో ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతోపాటు మరో నలుగురు కీలక నేతలు ఏయే స్థానాల నుంచి పోటీచేస్తున్నారో ప్రకటించారు. ఆ జాబితా ప్రకారం ముఖ్యమంత్రి పళనిస్వామి ఎడప్పడి నియోజవర్గం నుంచి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బోదినాయకనూర్ నుంచి బరిలో దిగనున్నారు.