న్యూఢిల్లీ: పాకిస్థాన్లోని బలోచిస్తాన్లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఆ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంట్లో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. హర్నోయ్ బలోచిస్తాన్లోని ఖోస్ట్ ప్రాంతంలో ఫ్లయింగ్లో పాల్గొన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. హెలికాప్టర్ కూలడానికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. మేజర్ మహ్మద్ మునీబ్ అఫ్జల్, మేజర్ కుర్రమ్ షాహజాద్, సుబేదార్ అబ్దుల్ వాహిద్, సిపాయ్ ఇమ్రాన్, షోయెబ్, నాయిక్ జలీల్ ఉన్నారు. ఇటీవలే బాలోచిస్తాన్లో ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ కూడా కూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో పాక్ ఆర్మీ జనరల్తోపాటు అయిదుగురు సీనియర్ మిలిటరీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు.