పాట్నా: పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు నిరసనలో భాగమే తప్ప మరొకటి కాదని ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ వ్యాఖ్యానించారు. అలాంటి నినాదాలు చేసేవారు పాకిస్థానీలు అవుతారని, పాకిస్థాన్కు వెళతారన్న భావన కాదని అన్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యాలయాలల్లో సోదాలు జరిగాయి. ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో దీనిని నిరసిస్తూ దేశంలోని పలు చోట్ల పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసనకు దిగారు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన పీఎఫ్ఐ నిరసనలో పాల్గొన్న కొందరు వ్యక్తులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీజేపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆ వీడియోపై దర్యాప్తు జరిపి దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
కాగా, ఆర్జేడీ సీనియర్ నేత శివానంద్ తివారీ ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు నిరసనలో భాగమే తప్ప మరొకటి కాదని అన్నారు. అలాంటి నినాదాలు చేసేవారు పాకిస్థానీలు అవుతారని లేదా పాకిస్థాన్కు వెళతారన్న అర్థం కాదని వ్యాఖ్యానించారు.
Patna, Bihar | Pakistan zindabad slogans are just a part of a protest but that doesn't mean those raising such slogans become Pakistani & will go to Pakistan: RJD leader Shivanand Tiwari on 'Pakistan zindabad' slogans heard during PFI protest in Pune pic.twitter.com/w5tEN8Yq7n
— ANI (@ANI) September 25, 2022