ముంబై, జూన్ 11: రోడ్డుపై గాయపడిన ఓ పక్షి కనిపించింది. వెంటనే దాన్ని కాపాడేందుకు ఇద్దరు కారు దిగారు. అయితే మానవతా దృక్పథంతో పక్షిని కాపాడాలని యత్నించిన వారిని విధి వంచించింది. వెనుక నుంచి ట్యాక్సీ కారు వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ హృదయవిదారక ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ బ్రిడ్జిపై మే 30న జరిగింది. ఈ ఘటనలో అమర్ మనీశ్ జరీవాలా అనే వ్యాపారి, ఆయన డ్రైవర్ మరణించారు. వీరు కారు దిగి పక్షిని కాపాడే ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.