హూజూరాబాద్ రూరల్ : మండలంలోని చెల్పూర్ గ్రామంలో మాజీ డిప్యూటీ స్పీకర్, రామాయంపేట ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సద్దుల బతుకమ్మ సందర్భంగా సందడి చేశారు. మహిళలతో బతుకమ్మ అటలు అడారు. అనందంతో మహిళలు పద్మాదేవేందర్రెడ్డితో సంతోషంగా గడిపారు. పద్మాదేవేందర్రెడ్డి అందరి దగ్గరికి పోయి పేరుపేరునా పలుకరించి బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
పద్మాదేవేందర్రెడ్డి తమతో కలిసిపోవడంతో గ్రామ మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.అమెతో పాటు ఎంపీపీ ఇరుమల్ల రాణీ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్లు బతుకమ్మ అటలు అడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇరుమల్ల సురేందర్రెడ్డి, పంజాల సదానందంతో పాటు గ్రామ మహిళలు తదితరులు ఉన్నారు.