లండన్, ఆగస్టు 15: రోదసిలో సుదీర్ఘ ప్రయాణాలు సాగించే వ్యోమగాముల కోసం అయస్కాంతాల నుంచి ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే వినూత్న సాంకేతికతను ఇంగ్లండ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రోడ్ ఉపరితలాల నుంచి వాయు బుడగలను ఉత్పత్తి చేసి, ఆక్సిజన్ను సృష్టించవచ్చని, తాము చేసిన ప్రయోగంలో ప్రాణవాయువు ఉత్పత్తి జరిగిందని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ పరిశోధకులు తెలిపారు.
ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టి ఇప్పటివరకూ వ్యోమగాములకు ప్రాణవాయువును సరఫరా చేస్తున్నారని, ఈ విధానంలో వెలువడే హైడ్రోజన్ వంటి వాయువులతో వ్యోమనౌకలోని వ్యవస్థలకు అంతరాయం కలుగొచ్చని పరిశోధకులు తెలిపారు. తాము అభివృద్ధి చేసిన తాజా సాంకేతికతతో అలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు.