న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ కలకలం రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. దీంతో ఆక్సిజన్కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ కొరత వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందున్న కరోనా రోగులు పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలును నడుపుతున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ తెలిపారు. రాయగఢ్లోని జిందాల్ స్టీల్ ప్లాంట్ నుంచి 70 టన్నుల ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు సోమవారానికి ఢిల్లీ చేరుతుందని చెప్పారు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు అంగుల్, కాలింగ్నగర్, రూర్కెలా, రాయ్గఢ్లోని స్టీల్ ప్లాంట్ల నుంచి మరిన్ని ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.