న్యూఢిల్లీ: వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇండియాలో పాజిటివిటీ రేటు తగ్గిందన్నారు. గత వారం దేశంలో పాజిటివిటీ రేటు 21.9 శాతంగా ఉందని, అయితే ఇప్పుడు ఆ రేటు 19.8 శాతానికి తగ్గినట్లు తెలిపారు. ఢిల్లీ, చత్తీస్ఘడ్, డమన్ అండ్ డయూ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో వైరస్ పాజిటివిటీ రేటు తగ్గిందని ఆయన తెలిపారు.
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా.. హాస్పిటళ్ల వద్ద వైరస్ సంక్రమణ నివారణ చర్యలు కీలకమని, అయితే సెకండరీ ఇన్ఫెన్లు వల్లే ప్రమాదం ఏర్పడుతోందని, ఫంగస్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ శాతం మరణాలు నమోదు అవుతున్నట్లు ఎయిమ్స్ డైరక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు.