న్యూఢిల్లీ, మే 28: దేశంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
యువత ఉద్యోగాల్లేక అల్లాడుతుంటే వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ పోస్టులకు కేటాయించిన నిధులు ఎక్కడికి పోయాయో తెలుసుకొనే హక్కు యువతకు ఉందన్నారు.