బేగంపేట్ : ఆత్మహత్యయత్నం చేసిన ఎంతోమందిని తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షించిన ఇద్దరు హోంగార్డులు కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ణ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. హుస్సేన్సాగర్ నెక్లెస్రో్డ్డులోని లేక్ పోలీస్స్టేషన్లో హోగార్డులుగా విధులు నిర్వహిస్తున్న వెంకటసుబ్బారెడ్డి, కృష్ణయాదవ్ లు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యారు. హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చాలామందిని వీరు రక్షించారని లేక్ ఇనిస్పెక్టర్ ధనలక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరినీ ధనలక్ష్మీతో పాటు స్టేషన్ సిబ్బంది అభినందించారు.