హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించాల్సినప్పటికీ, వివిధ కారణాల రీత్యా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు తమ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.