సీఎం కేసీఆర్ నాయకత్వంలో రిజర్వాయర్లు, ఎత్తిపోతల నిర్మాణాలు
సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు
తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ
అభివృద్ధి చూసే టీఆర్ఎస్లో చేరికలు
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు
హైదరాబాద్లో మంత్రి సమక్షంలో అందోలు కాంగ్రెస్, బీజేపీ నాయకుల చేరిక
సీఎం కేసీఆర్ కృషితో మెతుకు సీమ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో అందోల్కు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని మంత్రి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అనేకమంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతున్నదని, ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధ్దాలు చెప్పడం.. ఆగమాగం చేయడంలో బీజేపీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని మండిపడ్డారు.
అందోల్, మే 11 : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు జరిగిందని, సీఎం కేసీఆర్ చలవతో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఉమ్మడి జిల్లా డీసీఎంస్ మాజీ చైర్మన్ సిద్ధన్న పాటిల్ తోపాటు నల్ంలపల్లి ఎంపీటీసీ కోట సత్యమ్మ, మాజీ సర్పంచ్ వినయ్కుమార్పాటిల్, యువజన కాంగ్రెస్ నాయకులు మనీల్కుమార్, డాకూర్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీనివాస్రెడ్డి, వట్పల్లి మండలానికి చెందిన నాగరాజు, నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున్న టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి హరీశ్రావు, ఎ మ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ చలవతో సంగారెడ్డి జిల్లాలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డికి మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ మం జూరు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడంతోనే, సీఎంగా కేసీఆర్ ఉండడంతోనే ఇవన్నీ జిల్లాకు మంజూరు చేసుకోగలిగామని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తె లంగాణకు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలకు తెలంగాణ ప్రజల గోస పట్టదన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం అన్ని వర్గాలకు ఉపయోగకరంగా ఎన్నో కార్యక్రమా లు, పథకాలు అమలు చేస్తున్నదని, పలు సందర్భాల్లో ప్రతిపక్షాలే మెచ్చుకున్నాయని గుర్తుచేశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చవకబారు విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతీ పథకానికి పైసల్ మేమిస్తున్నాం…అంటూ ప్రగల్భాలు పలికే బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే కల్యాణలక్ష్మి, రైతుబంధు, ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా ఉందా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధ్దాలు చెప్పడం.. ఆగమాగం చేయడంలో బీజేపీకి నోబెల్ ఫ్రైజ్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. అబద్ధ్దాలతో కాలం గడుపుతూ తెలంగాణకు ఈ పార్టీలు హాని చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, వట్పల్లి ఏఎంసీ చైర్మన్ రజినీకాంత్, రాయికోడ్ మండల అధ్యక్షుడు బస్వరాజ్ పాటిల్, అల్లాదుర్గం మాజీ ఎంపీపీ కాశీనాథ్ పాల్గొన్నారు.