హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం రాబోయే మూడేళ్లపాటు వర్సిటీ అభివృద్ధి కోసం తన 21 పాయింట్ల రోడ్ మ్యాప్ను శుక్రవారం ఆవిష్కరించింది. సివిల్ సర్వీసెస్ అకాడమీని స్థాపించడం, అకడమిక్ ప్రోగ్రామ్లను రివైజ్ చేయడం, ఆన్లైన్-లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయడం వంటివి వీటిలో కొన్ని. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ మాట్లాడుతూ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థి కేంద్రం నూతన జాబ్ ఓరియెంటెడ్ యూజీ, పీజీ కోర్సులు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్లను సృష్టించడంతో పాటు ఎక్సలెన్స్ పాఠశాలలను స్థాపించాలని విశ్వవిద్యాలయం యోచిస్తోన్నట్లు వీసీ పేర్కొన్నారు.