హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హాస్టళ్లను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. నిజాం, సైఫాబాద్, కోఠి కళాశాలల హాస్టళ్లు మూసివేస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అధికారులు ఖండించారు. వసతిగృహాలను మూసివేయడం లేదని వెల్లడించారు.
మూసివేతపై వస్తున్న అసత్య ప్రచారాలను విద్యార్థులు నమ్మొద్దని సూచించారు. వర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల డిగ్రీ హాస్టళ్ల మూసివేత ఆలోచనేమి లేదని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతు, ఆధునికీకరణ పనులు మాత్రమే చేపట్టామని పేర్కొన్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.