న్యూఢిల్లీ : భారత్లో ఒప్పో ఎఫ్21 ప్రొ సిరీస్ను ఏప్రిల్ 12న లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఎఫ్21 ప్రొ సిరీస్లో భాగంగా ఒప్పో ఎఫ్21 ప్రొ, ఒప్పో ఎఫ్21 ప్రొ 5జీ లాంఛ్ కానున్నాయి. ఇక ఒప్పో ఎఫ్21 ప్రొ ప్లస్ ఈ సిరీస్లో లాంఛ్ అవుతుందా లేదా అనే దానిపై కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఒప్పో ఎఫ్21 ప్రొ న్యూ సన్సెట్ ఆరంజ్ కలర్లో లెదర్ తరహా ఫినిష్తో రానుండగా ఎఫ్21 ప్రొ 5జీ కాస్మిక్ బ్లాక్, రెయిన్బో స్పెక్ట్రమ్ కలర్స్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ల స్పెసిఫికేషన్లను ఒప్పో వెల్లడించలేదు.
ఎఫ్19, ఎఫ్19 ప్రొ ఫోన్లకు కొనసాగింపుగా రానున్నందున ఈ స్మార్ట్ఫోన్లు మెరుగైన సామర్ధ్యం, మెరుగైన కెమెరాలు, అత్యధిక బ్యాటరీ సామర్ధ్యం, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో కస్టమర్ల ముందుకొస్తాయని భావిస్తున్నారు. ఎఫ్21 ప్రొ సిరీస్ను ఏప్రిల్ 12 సాయంత్రం 5 గంటలకు జరిగే ఈవెంట్లో లాంఛ్ చేసేందుకు ఒప్పో సన్నద్ధమైంది. న్యూ స్మార్ట్పోన్ల ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలను ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించనుంది.