India Vs SA ODI | రాంచీలో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా తొమ్మిది ఓవర్లు ముగిసే లోపు ఓపెనర్లు పెవిలియన్ బాట పట్టారు. తొమ్మిదో ఓవర్లో రబడా తాను వేసిన ఐదో బంతినే అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఓపెనర్ శుభ్మన్ గిల్ క్రీజ్ను వదిలేయాల్సి వచ్చింది. అప్పటికి ఆయన వ్యక్తిగత స్కోర్ 28 పరుగులు.. కాగా, పదో ఓవర్ తొలి బంతిని ఆడిన శ్రేయస్ అయ్యర్ ఫోర్గా మలచడంతో టీం ఇండియా స్కోర్ ఫిఫ్టీ మార్క్ చేరుకుంది.
శుభ్మన్ గిల్తోపాటు ఓపెనర్గా వచ్చిన సారధి శిఖార్ ధావన్ మరోమారు విఫలం అయ్యాడు. 279 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సిన టీం ఇండియా బ్యాట్స్మన్లు దూకుడుగా ముందుకెళ్లలేకపోతున్నారు. తొలి వన్డేలో మాదిరిగానే రెండో వన్డేలోనూ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి శిఖార్ ధావన్ వ్యక్తిగత స్కోర్ 13 పరుగులు. టీం ఇండియా స్కోర్ 28 పరుగులుగా నమోదైంది.