హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవ్యాప్తంగా సుమారు 400 మంది ప్లేయర్లు పాల్గొననున్న ఓపెన్ టెన్నిస్ టోర్నీ శనివారం ప్రారంభం కానుంది. మొయినాబాద్లోని లేక్ వ్యూ టెన్నిస్ అకాడమీ వేదికగా జరుగనున్న ఈ టోర్నీని హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ సంఘం నిర్వహిస్తున్నది.
ఇప్పటి వరకు నిర్వహించిన తొమ్మిది టోర్నీలు విజయవంతమయ్యాయని ఇది పదో టోర్నీ అని సంఘం అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది నుంచి కొత్తగా 30 ప్లస్ కేటగిరీని కూడా చేర్చామని ఆయన వెల్లడించారు. 40+, 50+,60+, 70+ కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నారు. సీపీ సీవీ ఆనంద్, డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి సహా తదితర ప్రముఖులు బరిలో దిగనున్న ఈ టోర్నీ ఫైనల్ మంగళవారం జరుగనుంది.