హైదరాబాద్ : ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులందరికీ కనీసం 35 మార్కులు వేసి ఉత్తీర్ణులను చేయాలని నిర్ణయించింది. కొవిడ్ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.