న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్డౌనేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో ‘న్యాయ్’ పథకం ద్వారా పేదలకు చేయూతనందివచ్చని తెలిపారు. పరిస్థితి తీవ్రతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అర్థం చేసుకోవడంలేదన్నారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేకమంది అమాయక ప్రజలను చంపేస్తోందని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రాలు తీసుకునే ప్రయాణాలపై ఆంక్షలు, కర్ఫూ వంటి నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని పేదలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది. అందుకే వారికి నెలకు కొంత నగదు అందించడం అవసరమని తెలిపింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన న్యాయ్ పథకాన్ని అమలు చేయడం అవసరమని నొక్కిచెప్పింది. పార్టీ ప్రతిపాదించిన న్యూతమ్ ఆయ్ యోజన అమలు కోసం కేంద్రంపై రాహుల్ గాంధీ ఒత్తిడి తీసుకువస్తున్నారు. కొవిడ్ సంక్షోభంపై కేంద్రం స్పందించిన తీరును సైతం కాంగ్రెస్ విమర్శించింది.