అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా సముద్రంలో పడిపోయింది. ఈ ఘటన ముంబై తీరానికి 50 నాటికన్ మైళ్ల దూరంలో వెలుగు చూసింది.
ముంబై తీరానికి కొంత దూరంలో సముంద్ర కింద ఉన్న ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ను భారత ప్రభుత్వం బయటకు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులను పరిశీలించేందుకు వెళ్తున్న ఒక హెలికాప్టర్.. సాంకేతిక లోపంతో సముద్రంలో కూలిపోయినట్లు సమాచారం.
ఈ హెలికాప్టర్లో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉండగా.. ఇప్పటి వకు నలుగురిని రక్షించినట్లు ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) తెలిపింది. విషయం తెలియగానే ఒక కోస్ట్ గార్డ్ షిప్ ఘటనా స్థలానికి చేరుకుందని, ముంబై నుంచి మరో షిప్ అక్కడకు వచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు.
ముంబై తీరం నుంచి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఉండే రిగ్పై ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ దానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడిపోయినట్లు ఒక అధికారి తెలిపారు.