ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ సరికొత్త స్మార్ట్టీవీని భారత్లో ఆవిష్కరించింది.
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్తో కలిసి బడ్జెట్ విభాగంలో మరో స్మార్ట్టీవీని విడుదల చేసింది. Y-సిరీస్లో ఇప్పటికే వన్ప్లస్ టీవీ 32వై1, వన్ప్లస్ టీవీ 43వై1 మోడళ్లు లాంచ్ అయ్యాయి.
తాజాగా 40 అంగుళాల వేరియంట్ను కంపెనీ విడుదల చేసింది. కొత్త మోడల్ టీవీ ధరను రూ.23,999గా నిర్ణయించారు. కొత్త వన్ప్లస్ వై సిరీస్ మోడల్ను ఫ్లిప్కార్ట్ ఫస్ట్సేల్లో రూ.21,999కే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే వినియోగదారులు అదనంగా 10శాతం తగ్గింపును కూడా పొందొచ్చు.
గత రెండు వేరియంట్లలో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తాజాగా విడుదలైన మోడల్లోనూ ఉన్నాయి. వన్ప్లస్ టీవీ వై-సిరీస్ 40 అంగుళాలు మోడల్ మే 26 నుంచి ఫ్లిప్కార్ట్లో రూ.21,999కే లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రారంభ ఆఫర్ మే 31 వరకు కొనసాగుతుంది.