సిద్దిపేట : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకిరికి తీవ్ర గాయాలైన సంఘటన ములుగు మండలం లక్ష్మక్కపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకుంది.
ములుగు ఎస్ఐ రంగ కృష్ణ కథనం ప్రకారం.. రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన మైసాని నర్సింలు(45) అదే గ్రామానికి చెందిన మైసాని సత్తయ్య(47) సిద్దిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.
ఈ క్రమంలో లక్ష్మక్కపల్లి శివారుకు చేరుకోగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో నర్సింలు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా సత్తయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
సత్తయ్యను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానకు, నర్సింలు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య