అమరావతి,జూన్ 29:ఏపీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం టోల్ గేట్ వద్ద పోలీసులు మంగళవరం భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేట పైనాపిల్ లోడు లోపల లారీలో గంజాయి తరలిస్తుండగా…పోలీసులుడ్రైవర్ ని అదుపులోకి తీసుకుని వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.