ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి
హైదరాబాద్, ఫిబ్రవరి 7 ఆర్మూర్/నందిపేట: నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యుడు ఆ పార్టీకి గుడ్బై చెప్పి వందమంది అనుచరగణంతో గులాబీ గూటికి చేరారు. సోమవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ నిజామాబాద్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసంలో ఆర్మూర్ మండలం చేపూర్ ఎంపీటీసీ సభ్యుడు బాలనర్సయ్య టీఆర్ఎస్లో చేరారు. నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ముదిరాజ్ కుల సంఘం సభ్యులు గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే రెండు, మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం, ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్నివర్గాల వారు టీఆర్ఎస్లో చేరడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరుతున్నవారికి సముచిత స్థానం కలిపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సంతోష్, ఎంపీపీ నరసయ్య, పార్టీ మండల అధ్యక్షుడు ఆలూరి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు మహేందర్, శ్యామ్, రంగన్న, ప్రభుదాస్, రాజారెడ్డి, శ్రీను, చేపూర్ సర్పంచ్ సాయన్న పాల్గొన్నారు.