మెదక్ : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు దుర్మరణం చెందిన విషాద సంఘటన జిల్లాలోని రామాయంపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన కాసుల నర్సింహులు(40) తన బైక్పై కామారెడ్డి వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీ కొట్టాడు. దీంతో నర్సింహులు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు మృతదేహాన్ని తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.